గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం

by Disha Web Desk 15 |
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి  దుర్మరణం
X

దిశ, భీమిని : మండల పరిధిలోని తంగళ్లపల్లి, వెంకటాపూర్ గ్రామాల మధ్యలో శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. తంగళ్లపల్లి గ్రామానికి చెందిన రత్నం నానయ్య (60) అనే వ్యక్తి చీపుర్లు అమ్ముకోవడానికి సుర్జాపూర్ గ్రామానికి నడిచి వస్తున్నాడు. ఈ క్రమంలో రెండు గ్రామాల మధ్యలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తల పగిలి తీవ్ర రక్త స్రావం అవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కొడుకు ఉన్నారు. కుమారుడు రత్నం వెంకటేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కన్నేపల్లి ఎస్సై నరేష్ తెలిపారు. కూలి పని చేసుకుని బతికే కుటుంబంలో యజమాని మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదన పలువురిని కంటతడి పెట్టించింది.


Next Story

Most Viewed