- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ల్యాండ్ సర్వేకు రూ.లక్ష లంచం అడిగిన తహసీల్దార్
by Disha Web Desk 2 |
X
దిశ, అంతర్గాం: పెద్దపల్లి జిల్లాలో అవినీతికి పాల్పడుతూ రెవెన్యూ అధికారులు ఏసీబీకి చిక్కారు. సోమవారం అంతర్గాంలో జరిగిన దాడిలో రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ప్రత్యక్షంగా పట్టుకున్నారు. ఓ భూమి సర్వే చేసేందుకు సర్వేయర్కు పనులు పురమాయించేందుకు తహసీల్దార్ రూ.లక్ష లంచం అడిగినట్టుగా ఏసీబీ అధికారులు తెలిపారు. ఓ ప్రైవేట్ అసిస్టెంట్ ద్వారా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్ సంపత్, సీనియర్ అసిస్టెంట్, ప్రైవేట్ అసిస్టెంట్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ కే.భద్రయ్య ఆధ్వర్యంలో జరిగిన ఆ దాడుల్లో సీఐ రవిందర్, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు. తహసీల్దార్ సహా ఇతర అధికారుల స్టేట్మెంట్లను రికార్డు చేసిన తరువాత పూర్తి వివరాలు తెలియజేస్తామని ఏసీబీ వర్గాలు తెలిపాయి.
Next Story