- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
''మహిళలకు రక్షణ కరువు.. ఆత్మరక్షణ కోసం ఆయుధం పట్టాలి''

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో మహిళలపై, పిల్లలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని, ఇలాగే కొనసాగితే పిల్లలు, మహిళలు ఆత్మరక్షణ కోసం ఆయుధాలు చేపట్టి తిరగాల్సిన రోజు వస్తుందేమోనని ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఇందిరా శోభన్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. 2012లో ఢిల్లీలో జరిగిన రేప్ కేసులో ముగ్గురి నిందితుల ఉరిశిక్ష సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నా 19 ఏళ్ల యువతి విధులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తుండగా ముగ్గురు యువకులు కారులో అపహరించి అత్యాచారం చేసి హత్య చేశారు. సుప్రీంకోర్టు అత్యాచారం చేసిన నిందితులను నిర్దోషులుగా ప్రకటించిందన్నారు.
బిల్కీస్ భాను కేసులో కూడా కేంద్ర ప్రభుత్వం తనకున్న అధికారంతో సత్ప్రవర్తన పేరుతో నిందితులని వదిలివేయడం సభ్య సమాజానికి సిగ్గుచేటన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు కేసుని సస్పెండ్ చేసి నిందితులకు బెయిల్ మంజూరు చేయడం చాలా దురదృష్టకరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేస్ సంఘటన తర్వాత పది కేసులు నమోదయాలని ఇటీవల బంజారాహిల్స్ స్కూల్లో విద్యార్థినిపై స్కూల్ ప్రిన్సిపాల్ డ్రైవర్ రేప్ సంఘటన.. ఇలా మహిళలపై దారుణంగా ఆత్యాచారాలు చేసి హత్యలు చేస్తున్న శిక్ష పడకుండా బయటకు రావడం అనేది మహిళలకు, ఆడపిల్లలకు మాన ప్రాణాలకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. కోర్టు తీర్పులపై రాష్ట్రాల కేంద్ర మహిళా కమిషన్లు స్పందించి నిందితులకు శిక్షపడేలాగా చేయాలని విజ్ఞప్తి చేశారు.