- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
విధులు తక్కువ.. కలెక్షనంటే మక్కువ!

దిశ, సిటీ బ్యూరో : ఒక్కసారి ఆదేశాలిచ్చి తమ పనైపోయిందని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు భావించటం కింది స్థాయి సిబ్బందికి వరంగా మారుతుంది. పరిపాలనా పరమైన విధులు, పోస్టును బట్టి నిర్వర్తించాల్సిన బాధ్యతలు పక్కనపెట్టి, కేవలం జేబులు నింపుకునే పనికే జీహెచ్ఎంసీ ఉద్యోగులు, అధికారులు పరిమితమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓటరు కార్డు, ఆధార్ కార్డులను లింకు చేయాలని బూత్ లెవల్ ఆఫీసర్లను ప్రత్యేకంగా నియమించినా ఆ ప్రక్రియ ముందుకు సాగటం లేదు. జీహెచ్ఎంసీలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, వ్యాలుయేషన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లతో పాటు లైసనింగ్ ఆఫీసర్లకు ఓటరు కార్డు, ఆధార్కార్డు అనుసంధాన బాధ్యతలను అప్పగించారు.
అయినా ఏ ఒక్క సర్కిల్లో ఈ ప్రక్రియ ఆశాజనకంగా సాగటం లేదు. చాలా సర్కిళ్లలో ప్రక్రియ అసలు ప్రారంభించనే లేదు. దీనికి తోడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఇప్పటికే సర్కారుకు అందిన 30 సర్కిళ్లలోని సుమారు 7 లక్షల దరఖాస్తులను ఫీల్డు లెవెల్లో వెరిఫై చేయాలన్న బాధ్యతలు అప్పగించి నెలలు గడుస్తున్నా, ఒక్కో అధికారి ఇప్పటి వరకు కనీసం 50 నుండి వంద దరఖాస్తులను కూడా క్షేత్రస్థాయి కెళ్లి వెరిఫికేషన్ చేసిన దాఖలాల్లేవు.
ఈ బాధ్యతలు స్వీకరించిన కొందరు బిల్ కలెక్టర్లు, టాక్స్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు తమకిచ్చిన దరఖాస్తులతో ఓ ఏరియాకు వెళ్లి అక్కడి రాజకీయ నాయకులతో హోటళ్లలో కూర్చుని, వారు చెప్పిన వివరాలు వెరిఫికేషన్ రిపోర్టులు సమర్పిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు సైతం ఒక్కసారి బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలిచ్చినా తర్వాత కనీసం తమ ఆదేశాలు క్షేత్ర స్థాయిలో ఎలా అమలవుతున్నాయన్న విషయాన్ని పట్టించుకోకపోవటమే ఇందుకు ప్రధాన కారణంగా కన్పిస్తుంది.
ఖైరతాబాద్, అంబర్పేట, మెహిదీపట్నం, సికింద్రాబాద్ సర్కిళ్లలో ఓటరు కార్డు, ఆధార్ కార్డు లింక్, డబుల్ ఇళ్ల దరఖాస్తుల వెరిఫికేషన్ వంటి బా ధ్యతలు నిర్వర్తించాల్సిన సిబ్బందిచే మెడికల్ ఆఫీసర్లు, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్లు హాస్టల్స్, మెస్, హోటళ్లు వంటి వ్యాపార సంస్థలకు నోటీసులిచ్చి నిర్వాహకులను భయపెడుతూ యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రోజువారీ వసూళ్ల టార్గెట్లు..
ప్రధాన కార్యాలయంలోని వివిధ విభాగాధిపతులు ప్రత్యేక సమావేశం నిర్వహించి మరీ ఓటరు కార్డు, ఆధా ర్కార్డు లింకు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల వెరిఫికేషన్ బాధ్యతలను అప్పగించిన, సర్కిల్ స్థాయి, జోనల్ స్థాయి అధికారులు ఆ బాధ్యతలను పక్కనబెట్టి, తమకు అడ్డదారిలో ఆదాయాన్ని చూపే పనులే సిబ్బందికి కేటాయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ట్రేడ్ లైసెన్స్కు సంబంధించిన నోటీసుల సం ఖ్యను టార్గెట్ ఇచ్చి, వాటిని స్వీకరించిన హోటళ్లు, హాస్టళ్లు ఇతరత్ర వ్యాపార సంస్థల యజమానులు భయపడి మరుసటి రోజు ఆఫీసుకొచ్చేలా బెదిరించాలని అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
లేనిపోని నిబంధనలను చూపటంతో భయబ్రాంతులయ్యే వ్యాపార సంస్థల నిర్వాహకుల నుంచి అందినంత దండుకుని, లక్షల్లో విధించాల్సిన ట్రేడ్ లైసెన్స్ ఫీజులను వేలల్లోకి, వేలలో వసూలు చేయాల్సిన ఫీజులను వందల్లోకి మార్చి జీహెచ్ఎంసీ రావల్సిన నిధులను జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.