- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
సింగరేణి కార్మికుల కుటుంబాలకు భారీ శుభవార్త
by Gantepaka Srikanth |
![సింగరేణి కార్మికుల కుటుంబాలకు భారీ శుభవార్త సింగరేణి కార్మికుల కుటుంబాలకు భారీ శుభవార్త](https://www.dishadaily.com/h-upload/2024/06/11/342104-singareni-workers.webp)
X
దిశ, వెబ్డెస్క్: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. కారుణ్య నియామకాల వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 35 ఏళ్లు ఉన్న వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచుతూ మంగళవారం సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నది. 2018 మార్చి 9 కటాఫ్ తేదీ నుంచి ఈ ఆదేశాలు అమలు చేస్తున్నట్లు సింగరేణి సీఎండీ వెల్లడించారు. ఈ ఉత్తర్వులతో 300 మంది నిరుద్యోగులు తక్షణమే లబ్ది పొందనున్నారు. దీంతో సింగరేణి కార్మికుడు మెడికల్ ఇన్వ్యాలిడేషన్కు గురైనా, మరణించినా కారుణ్య నియామకాల్లో వారసులకు ఉద్యోగాలు కల్పిస్తారు.
Next Story