మావోయిస్టులు అమర్చిన బాంబు బ్లాస్ట్.. ఇద్దరు చిన్నారులు మృతి

by Rajesh |
మావోయిస్టులు అమర్చిన బాంబు బ్లాస్ట్.. ఇద్దరు చిన్నారులు మృతి
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఐఈడి మందు పాతర పేలి ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన ఐఈడి మందు పాతరను, ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ వెలికి తీసే ప్రయత్నం చేయడంతో, ఒక్కసారిగా భారీ శబ్దంలో పేలుడు సంభవించింది. ఐఈ డి బాంబు విస్ఫోటనానికి ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు.

Next Story

Most Viewed