- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ,వెబ్డెస్క్ :సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వెనుక అంతరార్ధంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేరుకే టీఎంసీలు కానీ కేసీఆర్ కాళేశ్వరం పర్యటన మాత్రం ఆయన కుమారుడు కేటీఆర్ కోసమేనన్నారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు ఫాంహౌజ్ లో కేసీఆర్ దంపతులు పూజలు చేశారని అన్నారు. ఆ పూజా సామాగ్రిని కాళేశ్వరం త్రివేణి సంగమంలో కలిపేందుకు వెళ్లారని చెప్పారు. ఇక ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు తలెత్తినప్పుడల్లా మంత్రి ఈటలను ముందుంచుతున్నారని, పార్టీలో ఆయనకు అన్యాయం జరిగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ సీఎం అయినా , కాకపోయినా తెలంగాణ ప్రజలకు లాభం లేదన్నారు. ఒకవేళ అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు కేటీఆర్ సీఎం కావడం ఇష్టం లేకపోతే బీజేపీలోకి రావొచ్చని ఆహ్వానిచ్చారు. కానీ బీజేపీలో చేరే నేతలపై ఎలాంటి అవినీతి మరక ఉండకూడదని బండి సంజయ్ షరతు విధించారు.