- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, డైనమిక్ బ్యూరో: క్యూన్యూస్ అధినేత, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న చంచల్గూడ జైలు నుంచి సోమవారం సాయంత్రం విడుదల అయ్యారు. ఈ సందర్భంగా మల్లన్న విడుదల విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు, టీం సభ్యులు జైలు వద్దకు భారీగా చేరుకొని స్వాగతం పలికి, ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా మల్లన్న మీడియాతో మాట్లాడుతూ.. అక్రమంగా తనపై నేరాలు మోపారని, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు. బెయిల్ వచ్చి రిలీజ్ అవుతున్నానని తెలిసి, ఆఖరి క్షణం వరకూ నన్ను జైలు నుంచి బయటకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తనపై ఇప్పటివరకు 37 కేసులు ఉన్నాయని, ఇంకో మూడు కేసులు నాకు లెక్క కాదని అన్నారు.
సమాజంలో తప్పు చేసినోళ్లు భయపడాలి కానీ, ఏ తప్పు చేయకుండా జైలు జీవితం గడిపిన తనకేం భయం లేదని వెల్లడించారు. తనపై మోపిన కేసులపై వందశాతం న్యాయస్థానాల్లో పోరాటం చేస్తానని, న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. అంతేగాకుండా.. నా విడుదల సందర్భంగా జైలు వద్దకు భారీగా తరలివచ్చిన అభిమానులకు ధన్యావాదాలు అని, ఈ అభిమానం అందరికీ దక్కదు అన్నారు. ఇన్ని రోజులు జైలులో ఉండి ఖైదీల జీవితాలను చదివాను, ఈ చంచల్గూడ జైలులో కేసీఆర్ బాధితులు 500 మంది ఉన్నారు. త్వరలోనే మీడియా ముందుకు వస్తానని, జైల్లో నన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా చంపాలనుకున్నారో చెబుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
https://twitter.com/DubbakaMuncipal/status/1457708116389208065?s=20