OnePlus నుంచి రాబోతున్న సరికొత్త ట్యాబ్.. లాంచ్ ఎప్పుడంటే..

by Disha Web Desk 17 |
OnePlus నుంచి రాబోతున్న సరికొత్త ట్యాబ్.. లాంచ్ ఎప్పుడంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: వన్‌ప్లస్ కంపెనీ నుంచి అధునాతన ట్యాబ్ భారత మార్కెట్లోకి విడుదల కాబోతుంది. ఈ మోడల్ పేరు ‘OnePlus Pad Go’. ఇది అక్టోబర్ 6న ఇండియాలో అందుబాటులోకి వస్తుందని కంపెనీ ఇటీవల ధృవీకరించింది. దీని గురించిన ఫీచర్లను ఇటీవల ఒక టిప్‌స్టర్ లీక్ చేశాడు. దాని ప్రకారం, ఈ ట్యాబ్ 11.3 అంగుళాల 2.4k డిస్‌ప్లే అమర్చబడి ఉంటుందని తెలుస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ కూడా ఉంటుంది. డిస్‌ప్లే క్వాలిటీలో ఏమాత్రం రాజీ పడకుండా యూజర్లకు నచ్చే విధంగా ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. SIM ఆప్షన్ కూడా ఉంది. టాబ్లెట్ ఆండ్రాయిడ్ 13-ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 14తో రన్ అవుతుంది. దీనిలో నాలుగు స్పీకర్లను అమర్చారు. ఇది వంపు తిరిగిన సన్నని బెజెల్స్‌ను కలిగి ఉంటుంది. వెనుకవైపు ఒకే కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. అంచనాల ప్రకారం, ఈ ట్యాబ్ ధర రూ.25,000 వరకు ఉండవచ్చు.


Read More 2023 Telangana Legislative Assembly election News
For Latest Government Job Notifications
Follow us on Google News




Next Story