సెప్టెంబర్ 21న మార్కెట్లోకి Motorola కొత్త స్మార్ట్‌ఫోన్

by Disha Web Desk 17 |
సెప్టెంబర్ 21న మార్కెట్లోకి Motorola కొత్త స్మార్ట్‌ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: Motorola కంపెనీ ఇండియాలో కొత్తగా ‘Edge 40 Neo’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. సెప్టెంబర్ 21న ఇది భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అంచనాల ప్రకారం, దీని ధర రూ.24,999. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి ఉంటుంది. ఈ ఫోన్ 6.55-అంగుళాల పూర్తి-HD+(1,080x2,400 పిక్సెల్‌లు) poLED కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. Android 13 ద్వారా రన్ అవుతుంది. ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 7030 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరాల విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ, 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు 32-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 68W వైర్డు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందించారు. అలాగే, దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP68 రేటింగ్ కలిగి ఉంది.


Read More 2023 Telangana Legislative Assembly election News
For Latest Government Job Notifications
Follow us on Google News




Next Story