Jaggampet MLAపై టీడీపీ యువనేత తీవ్ర ఆరోపణలు

by srinivas |   ( Updated:2023-01-20 13:41:13.0  )
Jaggampet MLAపై టీడీపీ యువనేత తీవ్ర ఆరోపణలు
X

దిశ, (ఉభయ గోదావరి ప్రతినిధి): జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు రూ. 100 కోట్లు అవినీతికి పాల్పడ్డారని, అక్రమ సంపాదనతో 108 ఎకరాలను కొన్నారని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆరోపించారు. రెండో విడత జగనన్న భూసేకరణ కార్యక్రమంలో భాగంగా రైతు భూమికి ఎక్కువ ధర మంజూరు చేయించుకుని కొన్ని కోట్ల రూపాయిలు జేబులో నింపుకున్నారని అన్నారు. అదే విధంగా జగనన్న స్థలాలు మెరక చేసే పనుల్లో భాగంగా ఉపాధి హమీ నుంచి కోట్లాది రూపాయిలు మంజూరు చేయించుకుని వాటిని కూడా జేబులో వేసుకొన్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వీటితో మంచి గిరాకీలో ఉన్న 108 ఎకరాల పొలాన్ని కొన్నారని, ఇంకా భవిష్యత్తులో చాలా కొంటారని సంచలన వాఖ్యలు చేశారు. శుక్రవారం రాష్ట్రంలోనే ప్రప్రథమంగా 'ప్రతిపక్షంతో ఒక్కరోజు' అనే కార్యక్రమానికి 'దిశ' పత్రిక జగ్గంపేటలో శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్ ఒక్క పూట దిశ ప్రతినిధితో కలిసి నియోజకవర్గంలో పర్యటించారు. చాలా సమస్యలు దిశ ప్రతినిధికి చూపించారు. స్థానిక శాసన సభ్యుడిపై అవినీతి ఆరోపణలు చేశారు

కార్యక్రమం సాగింది ఇలా..

ముందుగా నవీన్‌తో కలిసి నియోజకవర్గం పరిధిలోని మల్లవరం లిప్టు ఇరిగేషన్‌ను సందర్శించారు. అక్కడ పనులు సగంలోనే నిలిచిపోయాయి. లిప్టు ఇరిగేషన్ వల్ల 9 గ్రామాలకు త్రాగునీరు, 10000 ఎకరాలకు సాగు నీరు అందుతుంది. అయితే మల్లవరం లిప్టు ఇరిగేషన్ కోసం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ. 130 కోట్లు మంజూరు చేయించారు. ఆ సమయంలో ఎన్నికలు రావడం, శాసన సభ్యులు మారడంతో పనులకు బ్రేకు పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగ్గంపేటలో సరైన రహదారులు లేవు. అంతేగాక డ్రైనేజీ సదుపాయం లేదు. దీంతో మొన్నటి దాకా కురిసిన వర్షాలకు జనం చాలా ఇబ్బందులు పడ్డారు. కొద్దిపాటి వర్షానికే రోడ్లు జలమయం అవుతున్నాయి. దోమలు, ఈగలతో జనం బేజారెత్తిపోతున్నారు. చాలా మంది రోగాల పాలవుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. అక్కడ సరైన పడకలు లేవు. సమర్థులైన వైద్యులు లేరు. మందుల కొరత అధికంగా ఉంది. గత కరోన్నా సమయంలో వైద్యులు లేక ప్రజలు చాలా అవస్థలు పడ్డారు. తాజాగా కూడా అదే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇర్రిపాకలోనూ పర్యటించారు. అక్కడ అక్కడ గోపాల రావు చెర్వు ఉంది. దీనిపై ఆధార పడి 600 ఎకరాల ఆయకట్టు ఉంది. దీన్ని కూడా ఎమ్మెల్యే విక్రయించినట్లు తెలిసింది.



Next Story

Most Viewed