‘కోర్టులు ఎవరికి పడితే వారికి.. ఊరికే స్టేలు ఇవ్వవు’

by  |
‘కోర్టులు ఎవరికి పడితే వారికి.. ఊరికే స్టేలు ఇవ్వవు’
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రజలను ప్రశాంతంగా ఉండనివ్వకుండా ప్రభుత్వం అల్లకల్లోలం సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు భూములు పంచే నెపంతో అరాచకం చేస్తోందన్నారు.

అంతేగాకుండా న్యాయస్థానాలను కూడా ప్రభుత్వం రాజకీయాల్లోకి లాగాలని చూస్తోందని విమర్శించారు. ఏ విషయంలోనైనా కోర్టులు ఎవరికి పడితే వారికి ఊరికే స్టేలు ఇవ్వవు అని అన్నారు. పేదల భూములు లాక్కొని, పేదలకు ఇవ్వడం చట్ట విరుద్ధం అని కనకమేడల ఎద్దేవా చేశారు.



Next Story

Most Viewed