ఖమ్మం సరిహద్దుకొచ్చిన నారా లోకేశ్‌.. ఎందుకంటే..?

by Sridhar Babu |   ( Updated:2021-08-30 22:40:41.0  )
ఖమ్మం సరిహద్దుకొచ్చిన నారా లోకేశ్‌.. ఎందుకంటే..?
X

దిశ, పాలేరు: పోలవరం ముంపు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వస్తుండగా మంగళవారం ఉదయం ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం వద్ద టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ కాన్వాయ్ ఆపి కొద్ది సేపు నాయకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయ పరిస్థితులను నాయకులను అడిగి తెలుసుకున్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు విని వారిని ప‌రామ‌ర్శించ‌నున్నట్లు వివరించారు. పర్యటనలో భాగంగా నేడు భ‌ద్రాచ‌లం, టేకుల‌బోరు, శ్రీరామ‌గిరి, చింతూరులోని నిర్వాసితులను పరామర్శించనున్నారు. రేపు రంప‌చోడ‌వ‌రం, దేవీప‌ట్నం, పెద‌వేంప‌ల్లి, ఇందుకూరు, ముసిరిగుంట, కృష్ణునిపాలెంలో తన పర్యటన కొనసాగనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు, కార్యదర్శి గుత్తా సీతయ్య, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు రజిని, తెలుగు యువత అధ్యక్షులు రంజిత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed