మహిళా న్యాయవాదిని వేధించిన టీడీపీ నాయకుడు అరెస్ట్..

by  |
మహిళా న్యాయవాదిని వేధించిన టీడీపీ నాయకుడు అరెస్ట్..
X

దిశ, ఖైరతాబాద్ : మహిళా న్యాయవాదికి చెందిన ఇంటిని తప్పుడు ధ్రువపత్రాలతో తన కుటుంబ సభ్యుల పేరున మార్చుకునేందుకు రమేష్ గైక్వాడ్ అనే టీడీపీ నాయకుడు ప్రయత్నించాడు. తరచూ బెదిరింపులకు పాల్పడుతున్న అతడిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. అమీర్ పేట్ లో నివసించే కనకదుర్గ 2017 సంవత్సరంలో ఎల్లారెడ్డి గుడా లో ఒక ఇంటిని కొనుగోలు చేసింది. ఆ ఇంటికి సమీపంలో నివసించే రమేష్ గైక్వాడ్ తప్పుడు పత్రాలతో జీహెచ్ఎంసి కార్యాలయంలో తన పేరున చేయించుకున్నాడు.

విషయం తెలుసుకున్న బాధిత న్యాయవాది అధికారులను నిలదీసి తిరిగి తన పేరున మార్చుకున్నారు. అయినా ప్రవర్తన మార్చుకోని రమేష్ గైక్వాడ్ అదే ఇంటి నెంబర్ ను ఉపయోగించి విద్యుత్, నీటి కనెక్షన్లను పొందాడు. వాటి ద్వారా ఆమె ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఇదేమిటని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నాడని న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమేష్ గైక్వాడ్ అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.


Next Story

Most Viewed