విద్యార్థులకు తమిళ ప్రభుత్వం బంపర్ ఆఫర్..

by  |
విద్యార్థులకు తమిళ ప్రభుత్వం బంపర్ ఆఫర్..
X

దిశ, వెబ్‌డెస్క్ : విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. కోవిడ్ నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు ఆన్ లైన్‌లో క్లాసులు వింటున్నారు. పలువురికి ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేకపోవడం, డేటా సమస్యలు ఎదురవుతుండటంతో ఇకమీదట ఆన్ లైన్ తరగతుల కోసం రోజుకు 2జీబీ డేటా చొప్పున ఇవ్వాలని పళనిస్వామి సర్కార్ నిర్ణయించింది.

ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాసంస్థల్లోనూ చదివే విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ నెల వరకు ఉచిత డేటా పథకం అమలులో ఉంటుందని తమిళనాడు ప్రభుత్వం మరోసారి స్పష్టంచేసింది.


Next Story

Most Viewed