- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా : తెలుగు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ తాప్సీ.. ప్రస్తుతం బాలీవుడ్లో ఫిమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్కు కేరాఫ్గా నిలిచింది. యాక్టింగ్, స్క్రీన్ ప్రజెన్స్తో బీటౌన్ ఫిల్మ్ మేకర్స్ను ఇంప్రెస్ చేసిన ఢిల్లీ బ్యూటీ.. అక్కడ చేతినిండా సినిమాలతో స్టార్డమ్ అనుభవిస్తోంది. కాగా 2016లో సుజిత్ సర్కార్ డైరెక్ట్ చేసిన ‘పింక్’ సినిమాలో యాక్టింగ్కు అవార్డు రాకపోవడం పట్ల నిరాశకు గురైనట్లు తాజా ఇంటర్వ్యూలో చెప్పింది. కానీ.. ఆ విషయాన్ని మరిచిపోలేదని, తప్పకుండా రివెంజ్ తీర్చుకుంటానని సరదాగా కామెంట్ చేసింది. ఆ మూవీలో తన పర్ఫార్మెన్స్ గుర్తించనప్పటికి, అప్కమింగ్ ఫిల్మ్ ‘రష్మి రాకెట్’ ఖచ్చితంగా ప్రేక్షకులను ఆలోచింపజేస్తుందని తెలిపింది.
‘దయచేసి నాకు ఒక నేషనల్ అవార్డు ఇవ్వండి! అని ఎవరిని అడగాలి? ఇంతకంటే నేను ఏం చెయ్యగలను? నేను నా అత్యుత్తమ పనితీరును మాత్రమే ప్రదర్శించగలను, దానిపై మాత్రమే నాకు నియంత్రణ ఉంది. రెగ్యులర్ అవార్డుల కోసం కూడా నేనెప్పుడూ లాబీయింగ్ చేయలేదు, అందుకే ఒక్క అవార్డు గెలవడానికే చాలా సమయం పట్టింది. ఇక నేషనల్ అవార్డు కోసం నేను ఎలా లాబీ చేయగలను?’ అని వివరించింది. ఇక చివరగా ‘హసీన్ దిల్రుబా’ సినిమాలో కనిపించిన తాప్సీ నెక్ట్స్ ఫిల్మ్ ‘రష్మి రాకెట్’ ఈ నెల 15న జీ5లో రిలీజ్ కానుంది. ఇదేగాక తన చేతిలో ‘లూప్ లపేట, దొబారా, శభాష్ మిథు’ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి.