ఆయన లేని లోటును తీర్చలేం : HRC ఛైర్మన్

by  |
ఆయన లేని లోటును తీర్చలేం : HRC ఛైర్మన్
X

దిశ, వెబ్‌డెస్క్ : అనారోగ్య సమస్యల కారణంగా స్వామి అగ్నివేశ్ ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై తాజాగా మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ (HRC) జస్టిస్ జి. చంద్రయ్య స్పందించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌ మృతి భారత సమాజానికి తీరని లోటని ఆయన అభివర్ణించారు.

వెట్టి కార్మికుల విముక్తి కోసం అగ్నివేశ్‌ ఎంతో పోరాడారని, అణగారిన వారి హక్కుల కోసం ఉద్యమాలు చేశారని ఆయన గుర్తుచేసుకున్నారు. అలాంటి మహనీయ వ్యక్తిని వేరొకరితో భర్తీ చేయలేమని జస్టిస్ చంద్రయ్య వివరించారు.


Next Story