వృద్ధ దంపతుల ఆత్మహత్య..ఎందుకంటే..?

by  |
వృద్ధ దంపతుల ఆత్మహత్య..ఎందుకంటే..?
X

దిశ, జగిత్యాల: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలో కుటుంబ కలహాలతో ఇద్దరూ వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. ధరూర్ గ్రామానికి చెందిన హన్మంతరావు (68), సులోచన (58) ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే గ్రామానికి చెందిన వక్రాలు హనుమంతరావు అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితం కాగా ఆయన భార్య సులోచన సేవలు చేస్తూ వస్తుంది. ఇద్దరు కుమారులు ఉన్న వారిని పట్టించుకోవడంలేదు. మంచానికే పరిమితమైన భర్తకు ముందుగా ఉరివేసి తర్వాత వృద్ధురాలు ఇంటి ముందు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆదివారం ఉదయం వెలుగుచూసిన ఈ సంఘటనపై కుటుంబ సభ్యులు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. దీనితో జగిత్యాల రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించి, అనంతరం పోస్టు మార్టం నిమిత్తం మృత దేహాలను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై జగిత్యాల రూరల్ పోలీసులు సమగ్రంగా విచారణ చేస్తున్నారు. వృద్ధ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. దంపతుల ఆత్మహత్యలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed