కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య

by  |
కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య
X

నిర్మల్ జిల్లాలోని ముథోల్ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని ముద్గల్‌కు చెందిన జె. గంగాధర్ కళాశాల సమీపంలోనే చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కారణాలు తెలియరాలేదు. కళాశాలలో వేధింపుల కారణంగానే తమ కుమారుడు చనిపోయాడని గంగాధర్ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. కాలేజీ ప్రిన్సిపాల్‌ని సస్పెండ్ చేసి.. మృతుని కుటుంబానికి రూ. 20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని బంధువులు డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న డి.సి.ఓ సరస్వతి కళాశాలకు చేరుకున్నారు. ఈ సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థికి సంబంధించిన నోటు పుస్తకాలను పరిశీలించారు. అలాగే గంగాధర్‌తో సన్నిహితంగా ఉండే విద్యార్థులను కూడా ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.


Next Story

Most Viewed