- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కరీంనగర్: అలనాటి వైభవపు ఆనవాళ్లకు సజీవ సాక్ష్యంగా నిలిచే కరీంనగర్ జిల్లాలో చరిత్ర సాక్ష్యం మరోటి వెలుగులోకి వచ్చింది. చాళుక్యుల కాలంనాటి వినాయకుని విగ్రహం ఒకటి బయటపడడంతో ఎటు వైపు చూసినా జిల్లాలో శతాబ్దాల క్రితం నాటి చరిత్ర సాక్ష్యాలు సజీవంగా బయటపడుతున్నాయి. తాజాగా జిల్లాలోని గన్నేరువరం మండలం మైలారంలో చాళుక్యుల కాలం నాటి వినాయకుని విగ్రహం బయటపడింది. పూర్వకాలంలో దేవుని మైలారంగా పిలవబడే ఈ గ్రామంలో నల్లరాతితో తయారు చేసిన వినాయకుని ప్రతిమ బయటపడడం విశేషం. ఈ విగ్రహం క్రీ.శ 11, 12వ శతాబ్దానికి చెందినదని పురావస్తు శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వేములవాడ కేంద్రంగా చాళుక్యులు పరిపాలన కొనసాగించిన కాలంలో మైలారంలో ఈ విగ్రహాలను ప్రతిష్టించి ఉంటారని భావిస్తున్నారు. గ్రామంలోని భూమిలో లభ్యమైన ఈ శిల్పంతో గతకాలపు చరిత్ర వెలుగులోకి వచ్చినట్టయిందని ప్రజలు సంతోషిస్తున్నారు. చాళుక్యుల కాలంలో గ్రామంలో పెద్ద ఎత్తున వివిధ దేవతల రూపాల్లో ఉన్న విగ్రహాలను ప్రతిష్టించారని తెలుస్తోంది.