- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పొలం గొడవ.. తలపై గొడ్డలితో నరికి పరారీ

దిశ, వెబ్డెస్క్: ఇరువురి మధ్య కొద్దిరోజులుగా నడుస్తున్న పొలం వివాదం హత్యాయత్నానికి దారి తీసింది. దీంతో బాధితుడు చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన గొడ్ల వెంకటరత్నం, నరసింహరావుపేట గ్రామానికి చెందిన పిన్ని శ్రీనుకు కొద్దిరోజులుగా పొలం వివాదం నడుస్తోంది. ఇదివరకు చిన్ని చిన్న గొడవలు చోటు చేసుకోవడంతో వెంకటరత్నంపై .. శ్రీను కోపం పెంచుకున్నాడు.
ఇదే క్రమంలో సోమవారం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్తున్న వెంకటరత్నంపై దారిలో అడ్డు తగిలి.. తలపై గొడ్డలితో దాడి చేశాడు. వెంటనే వెంకటరత్నం కింద పడిపోవడంతో కాళ్లపై కూడా నరకడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పక్కకు గొడ్డలి పడేసి శ్రీను పరారయ్యాడు. గమనించిన స్థానికులు వెంకటరత్నంను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తలకు బలంగా గొడ్డలి దెబ్బ తగలడంతో తీవ్ర రక్తస్త్రావం జరిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.