- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో: బీసీలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అంత చులకన ఎందుకని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజులు శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. ప్రభుత్వాలకు బీసీల ఓట్లు అవసరం లేదా? అని ఆయన ప్రశ్నించారు. జనాభా లెక్కల్లో బీసీ జనగణను నిర్వహించాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా అరవై కోట్ల మంది బీసీలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారన్నారు. బీసీ జనాభా లెక్కలు తీస్తామని గతంలో చెప్పిన బీజేపీ ప్రభుత్వం.. ఇప్పుడు ఆకస్మికంగా వెనకడుగు వేయడం సరైన పద్ధతి కాదన్నారు.
హైదరాబాద్ బీసీ భవన్లో శనివారం జరిగిన బీసీ సంఘాల సమావేశంకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ… రాబోయే రెండు సంవత్సరాల్లో సాధారణ ఎన్నికలు జరుగుతాయని, ఈ లోపల బీసీల లెక్కలు తీస్తేనే బీజేపీకి ఓట్లు వేస్తామన్నారు.