- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రవీంద్ర జడేజాను మిస్ అవుతాం.. కానీ!
న్యూఢిల్లీ: రవీంద్ర జడేజాను మనం మిస్ అవుతాం.. కానీ అతడిని ఎవరూ కోల్పోరని టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అజయ్ జడేజా తెలిపారు. బుధవారం ఓ మీడియా ఇంటర్వ్యూలో అజయ్ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాపై జరిగిన సిరీస్లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో స్పిన్నర్ అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. మూడు మ్యాచుల్లో 8 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా స్థానంలో వచ్చిన అక్షర్ పటేల్ ఈ సిరీస్లో అధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు.
దీంతో అక్షర్ పటేల్ను మాజీ కెప్టెన్ అజయ్ జడేజా ప్రశంసించారు. ఈ సందర్భంగా అజయ్ జడేజా మాట్లాడుతూ.. 'తనకు మరో అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని అక్షర్ పటేల్ రెండు చేతులతో పట్టుకున్నాడు. టీమ్ ఇండియాలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. మనం అందరం రవీంద్ర జడేజాను మిస్ అవుతున్నాం. కానీ అతడిని ఎవరూ కోల్పోరు. బౌలింగ్, బ్యాటింగ్లో రవీంద్ర జడేజా పోషించిన పాత్ర ఎంతో ప్రత్యేకం. చాలా సందర్భాల్లో తన బౌలింగ్, బ్యాటింగ్తో జట్టుకు అండగా నిలిచాడు. ప్రస్తుతం స్పిన్నర్ అక్షర్ పటేల్ కూడా అదే జోరు కనబరుస్తున్నాడు. ఒకవేళ టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. రవీంద్ర జడేజా ఎలా తన వైపు తిప్పుకుంటాడో వేచి చూడాలి.' అని పేర్కొన్నారు.