ఆందోళన వద్దు..సూర్యకుమార్ యాదవ్

by Disha Web Desk 16 |
ఆందోళన వద్దు..సూర్యకుమార్ యాదవ్
X

ముంబై: టీమ్ ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఆందోళన చెందొద్దని బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఆస్ట్రేలియాతో జరిగే రెండో టీ20లో బుమ్రా జట్టులో చేరేందుకు సిద్దంగా ఉన్నాడని సూర్యకుమార్ పేర్కొన్నాడు. గురువారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బుమ్రా ఫిట్‌నెస్‌ గురించి విలేఖరులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. 'నవ్వుతూ.. ఈ ప్రశ్న టీమ్ మేనేజ్‌మెంట్‌కు లేదా ఫిజియోని అడగాలి. ప్రస్తుతం జట్టులో వాతావరణం చాలా బాగుంది. అందరూ ఆటగాళ్లు ఫిట్‌గా ఉన్నారు.

అలాగే రెండో టీ20 మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నారు. బుమ్రా ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తను ఫిట్‌గానే ఉన్నాడు.' అని పేర్కొన్నాడు. కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ దారుణంగా ఓడిపోయింది. డెత్ ఓవర్లలో అధికంగా పరుగులు సమర్పించుకోవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో రాణించలేకపోయారు.


Next Story

Most Viewed