దీప్తి శర్మ మన్కడింగ్ రనౌట్‌ను సమర్థించిన అశ్విన్..

by Disha Web Desk 13 |
దీప్తి శర్మ మన్కడింగ్ రనౌట్‌ను సమర్థించిన అశ్విన్..
X

దిశ, వెబ్‌డెస్క్: లార్డ్స్‌లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ ఉమెన్స్ జట్ల మధ్య సెప్టెంబర్ 24న శనివారం జరిగిన మూడో వన్డేలో చార్లీ డీన్‌ను అవుట్ చేయడానికి దీప్తి శర్మ మన్కడింగ్ పద్ధతిని ఉపయోగించిన విషయం తెలిసిందే. దీప్తిశర్మ వివాదాస్పద రీతిలో రనౌట్‌ చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రనౌట్ సరైనదేనని ఐసీసీ అప్‌డేటెడ్ రూల్స్ చెబుతున్నాయంటూ.. కొందరు ఆమెను సమర్థిస్తున్నారు.

అయితే ఈ విషయంలో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్‌.. ట్విట్టర్‌లో ఆసక్తికర కామెంట్స్ చేశారు. పూర్తిగా ఉద్దేశపూర్వకంగా చేసిందని, ఇది క్రికెట్ స్పిరిట్‌కు మాయని మచ్చని పేర్కొంటూ ట్వీట్లు చేశాడు. దీనిపై భారత బౌలర్ అశ్విన్ స్పందిస్తూ.. సామ్ బిల్లింగ్స్ మీద విరుచుకుపడ్డాడు. గతంలో అశ్విన్ ఐపీఎల్‌లో జాస్ బట్లర్‌ను మన్కడింగ్ పద్ధతిలో రనౌట్ చేసిన సంగతి తెలిసిందే. 'వాస్తవానికి దీప్తి శర్మ చేసిన పని చాలా గొప్ప ఆలోచన. విపరీతమైన ఒత్తిడిలో ఉన్న బౌలర్‌కు వికెట్‌ను ఎలా తీయాలనే విషయంలో పక్కా ప్లాన్ ఉంది. ఆమె దాన్ని సరిగ్గా అమలు చేసిందని' అని అశ్విన్ అన్నాడు.



Next Story

Most Viewed