టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్, కోహ్లీ చేసే పని అదే : వసీం జాఫర్

by Harish |
టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్, కోహ్లీ చేసే పని అదే : వసీం జాఫర్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ‌లపై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాళ్లద్దరికే ఇదే చివరి టీ20 వరల్డ్ కప్ అని వ్యాఖ్యానించాడు. తాజాగా తన యూట్యూబ్ చానెల్‌లో వసీం జాఫర్ మాట్లాడుతూ..‘టీ20 వరల్డ్ కప్‌ తర్వాత రోహిత్, కోహ్లీ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తారు. వాళ్లే నిర్ణయం తీసుకోవచ్చు లేదా సెలెక్టర్లను పక్కనపెట్టొచ్చు. అయితే, ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతారు. వాళ్లిద్దరి ఆఖరి టీ20 ఈ పొట్టి ప్రపంచకప్‌లోనే చూస్తామని అనిపిస్తుంది.’అని తెలిపాడు. కోహ్లీ ఫిట్‌నెస్ చూస్తుంటే అంతర్జాతీయ క్రికెట్‌లో అతను 100 సెంచరీలు కొడతాడని చెప్పుకొచ్చాడు. కాగా, టీ20 వరల్డ్ కప్-2022 తర్వాత రోహిత్, కోహ్లీ టీ20 ఫార్మాట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌లో తిరిగి పొట్టి ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed