- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ట్రోలర్స్పై భువీ భార్య కౌంటర్
న్యూఢిల్లీ: టీమ్ ఇండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ భార్య నపుర్నగర్ ట్రోలర్స్పై షాకింగ్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల జరిగిన మ్యాచుల్లో భువనేశ్వర్ కుమార్ దారుణంగా విఫలమవుతున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో 19వ ఓవర్ వేసిన భువీ ఏకంగా 16 పరుగులు సమర్పించాడు. దీంతో మ్యాచ్ ఆస్ట్రేలియా సొంతమైంది. ఈ క్రమంలో భువనేశ్వర్పై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
దీనిపై భువీ భార్య నుపుర్నగర్ మండిపడ్డారు. గురువారం ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్టు షేర్ చేశారు. ఈ పోస్టులో నుపుర్నగర్ మాట్లాడుతూ.. 'ప్రస్తుత రోజుల్లో చాలా మంది పనికి రాకుండా పోతున్నారు. ఏ పని చేయకుండా ఖాళీగా సమయం గడుపుతూ ఉంటారు. కానీ, వేరొకరిపై విమర్శలు చేయడానికి మాత్రం ముందుంటారు. వారందరికీ నేను ఒక్కటే చెబుతా.. మీ మాటలు ఎవరూ పట్టించుకోరు. మీరు ఎంత ట్రోల్ చేసినా ఎవరికీ ప్రభావం చూపదు. కాబట్టి.. ఇతరులను విమర్శించేందుకు కేటాయించే సమయాన్ని మీ లైఫ్ బాగు చేసుకోవడానికి కేటాయించండి.' అని పేర్కొన్నారు.