India Vs Australia 4th T20I: సిరీస్ టీమిండియాదే.. నాలుగో టీ20లో ఆసీస్‌‌పై ఘన విజయం

by Vinod kumar |
India Vs Australia 4th T20I: సిరీస్ టీమిండియాదే.. నాలుగో టీ20లో ఆసీస్‌‌పై ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: రాయ్‌పూర్‌ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో గెలిచింది. టీమిండియా విధించిన 175 రన్స్ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆసీస్ 20 ఓవర్లకు 154 పరుగులు మాత్రమే చేసింది. ఆసీస్‌ బ్యాటర్లలో మాథ్యూ వేడ్‌(36) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ 3 వికెట్లు, దీపక్‌ చాహర్‌ 2, రవి బిష్ణోయ్‌, అవేష్‌ ఖాన్‌ తలా వికెట్‌ సాధించారు.

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో రింకూ సింగ్‌ మరోసారి అద్బుత ఇన్నింగ్స్‌ ఆడాడు. రింకూ 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 పరుగులు చేశాడు. ఓపెనర్లు జైస్వాల్ (37), గైక్వాడ్ (32) పరుగులు చేశారు. చివర్లో జితేశ్ శర్మ 19 బాల్స్‌లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 35 పరుగులు చేయడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్‌లో.. బెన్ 3 వికెట్లు తీయగా.. జాసన్ బెహ్రెండోర్ఫ్, తన్వీర్ సంఘ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఆరోన్ హార్డీ ఓ వికెట్ తీశారు.



Next Story

Most Viewed