ఐసీసీ ఉమెన్స్ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన టీమిండియా ఆల్‌రౌండర్..

by Disha Web Desk 7 |
ఐసీసీ ఉమెన్స్ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన టీమిండియా ఆల్‌రౌండర్..
X

న్యూఢిల్లీ : ఐసీసీ ఉమెన్స్ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ దీప్తిశర్మ రెండో ర్యాంక్‌కు దూసుకెళ్లింది. సౌతాఫ్రికాలో జరుగుతున్న ట్రైసిరీస్‌లో సత్తాచాటుతున్న దీప్తి తాజా ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి 797 రేటింగ్ పాయింట్లు సాధించింది. ఆల్‌రౌండర్ విభాగంలో ఇప్పటికే రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్న ఆమె.. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 26వ స్థానంలో ఉన్నది.

బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రేణుక సింగ్, స్నేహ్ రాణా ఒక్క స్థానం కోల్పోయి 7వ, 11వ ర్యాంక్‌కు పడిపోయారు. రాజేశ్వరి గైక్వాడ్ 7 స్థానాలు ఎగబాకి 14వ ర్యాంక్‌కు చేరుకున్నది. బ్యాటింగ్ విభాగంలో స్మృతి మంధాన రెండో ర్యాంక్‌లోనే కొనసాగుతుండగా.. షెఫాలీ వర్మ 8వ ర్యాంక్‌, హర్మన్‌ప్రీత్ కౌర్ 12వ ర్యాంక్‌లను కాపాడుకున్నారు. జెమీమా రోడ్రిగ్స్ ఒక స్థానాన్ని వెనక్కినెట్టి 13వ ర్యాంక్‌కు చేరుకున్నది.


Next Story