- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Archery World Cup: ఆర్చరీ వరల్డ్ కప్ 2025లో భారత్ కు గోల్డ్ మెడల్

దిశ, వెబ్ డెస్క్: షాంఘైలో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ 2025 (Archery World Cup 2025) స్టేజ్ 2లో భారత కాంపౌండ్ పురుషుల జట్టు (Indian Compound Men's Team) స్వర్ణ పతకాన్ని (Gold medal) సాధించింది. ఈ ఆర్చరీ వరల్డ్ కప్ 2025 స్టేజ్ 2 మే 6న ప్రారంభం అయింది. ఇది మే 11 వరకు చైనాలోని షాంఘైలో జరిగనుంది. ఈ టోర్నమెంట్లో భారత పురుషుల కాంపౌండ్ జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్లో మెక్సికో జట్టును 232-228 స్కోరుతో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ టోర్నిలో భారత జట్టు క్వాలిఫికేషన్ రౌండ్లో 2134 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్స్కు నేరుగా అర్హత సాధించింది.
అభిషేక్ వర్మ 714 పాయింట్లతో రెండో స్థానంలో, రిషబ్ యాదవ్ 713 పాయింట్లతో మూడో స్థానంలో, ఓజస్ డియోటలే 707 పాయింట్లతో టాప్ 10లో నిలిచారు. భారత జట్టు క్వార్టర్ ఫైనల్స్లో గ్రేట్ బ్రిటన్ను 239-232 స్కోరుతో ఓడించింది. అలాగే డెన్మార్క్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో గట్టి పోటీని ఎదుర్కొన్న భారత్ 232-231 స్కోరుతో ఒక పాయింట్ తేడాతో విజయం సాధించింది. ఈ రోజు ఉదయం జరిగిన ఫైనల్లో, భారత జట్టు మెక్సికోను 232-228 స్కోరుతో ఓడించి స్వర్ణం సాధించింది.