బీపీఎల్‌లో విండీస్ ప్లేయర్ సునామి ఇన్నింగ్స్.. బౌలర్ల ఊచకోత..

by Disha Web Desk 13 |
బీపీఎల్‌లో విండీస్ ప్లేయర్ సునామి ఇన్నింగ్స్.. బౌలర్ల ఊచకోత..
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఖుల్నా టైగర్స్, కొమిల్లా విక్టోరియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కొమిల్లా విక్టోరియన్స్ బ్యాట్స్‌మెన్ జాన్సన్ చార్లెస్ 11 సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో.. టీ20లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. వెస్టిండీస్‌కు చెందిన ఈ 34 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జాన్సన్ చార్లెస్.. కొమిల్లా విక్టోరియన్స్ జట్టు తరఫున కేవలం 53 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 56 బంతులు ఎదుర్కొని 107 పరుగులు చేశాడు. ఇందులో 11 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఖుల్నా టైగర్స్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 210 పరుగులు చేసింది. ఖుల్నా టైగర్స్ బ్యాటర్స్‌లో.. తమీమ్ ఇక్బాల్ 95 రన్స్, కెప్టెన్ షాయ్ హోప్ 91 పరుగులు సాధించారు. అనంతరం బ్యాటింగ్‌కు బరిలోకి దిగిన కొమిల్లా విక్టోరియన్స్ జట్టు 211 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో ఛేదించింది. కొమిల్లా విక్టోరియన్స్ జట్టు బ్యాటర్స్‌లో.. జాన్సన్ చార్లెస్ మెరుపు సెంచరీ చేశాడు.


Next Story