క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. 10 మంది బ్యాటర్లు రిటైర్డ్ అవుట్.. అసలేం జరిగిందంటే?

by Harish |
క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. 10 మంది బ్యాటర్లు రిటైర్డ్ అవుట్.. అసలేం జరిగిందంటే?
X

దిశ, స్పోర్ట్స్ : క్రికెట్‌లో గాయపడి రిటైర్డ్ హర్ట్‌గా ఆటగాడు మైదానం వీడటం సాధారణమే. కానీ, రిటైర్డ్ అవుట్‌గా వెళ్లడం మాత్రం చాలా అరుదు. అలాంటిది జట్టు మొత్తం రిటైర్డ్ అవుటైంది. ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ క్వాలిఫియర్స్‌లో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. శనివారం ఖతార్‌తో జరిగిన మ్యాచ్‌లో యూఏఈ మహిళల జట్టు ఇన్నింగ్స్‌లో మొత్తం 10 మంది ప్లేయర్లు రిటైర్డ్ అవుట్ రూపంలో పెవిలియన్‌‌కు చేరారు. ఏ ఫార్మాట్‌లోనైనా జట్టు మొత్తం రిటైర్డ్ అవుట్ అవడం ఇదే తొలిసారి.

బ్యాంకాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ 16 ఓవర్లలో 192 పరుగులు చేసి ఆలౌటైంది. ఖతార్ బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేదు. మరి, యూఏఈ ఎలా ఆలౌటైందనుకుంటున్నారా?..ఆ జట్టు మంది 10 ప్లేయర్లు రిటైరయ్యారు. కెప్టెన్, ఓపెనర్ ఈషా ఓజా(113) మెరుపు శతకానికితోడు తీర్థ సతీశ్(74) కూడా రాణించడంతో యూఏఈ 16 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే 192 రన్స్ చేసింది. అయితే, వర్షం పడే చాన్స్ ఉండటంతో మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్‌ను ముగించాలని యూఏఈ భావించింది.

అయితే, వన్డే, టీ20లలో ఇన్నింగ్స్‌ను డిక్లరేషన్‌కు అనుమతి లేదు. దీంతో జట్టు మొత్తం రిటైర్ అవ్వాలని యూఏఈ సంచలన నిర్ణయం తీసుకుంది. మరో బంతి ఎదుర్కోకుండానే 10 మంది బ్యాటర్లు రిటైరయ్యారు. అందులో 8 మంది ఒక్క బంతి కూడా ఆడలేదు. ఇలా ఇన్నింగ్స్‌లో 10 మంది బ్యాటర్లు రిటైర్ అవడం క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారి కావడం గమనార్హం. ఇక, ఛేదనలో ఖతార్ జట్టు 29 పరుగులకే కుప్పకూలింది. దీంతో యూఏఈ 163 రన్స్ తేడాతో భారీ విజయం సాధించింది. టోర్నీలో యూఏఈకి ఇది రెండో గెలుపు.




Next Story

Most Viewed