సీతాఫల్‌మండి ప్రభాకర్‌ ఇక లేరు

by  |
Sitafal-Mandi1
X

దిశ, సికింద్రాబాద్: సీతాఫల్‌మండిలో వింద్యమూరి ప్రభాకర్‌ గుండె పోటుతో మృతి చెందారు. సోమవారం కార్తీక మాసం సందర్భంగా పూజల్లో పాల్గొన్న ఆయనకు గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సీతాఫల్‌మండి వాసులకు ఆయన సుపరిచితుడు. దత్తాత్రేయ ఆలయం పంతులుగా భక్తులకు సేవలు అందించారు. అదేవిధంగా పేద ప్రజలకు ఎన్నో విధాలుగా సేవలందించిన వ్యక్తి ఇప్పుడు మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకరం అంటూ పలువురు అభిప్రాయపడుతూ సంతాపం తెలియజేశారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.


Next Story