- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్ఐ గోవింద్పై సస్పెన్షన్ వేటు
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా బెట్టింగ్ వసూళ్ల వ్యవహారంలో మరో వికెట్ పడింది. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కేసులో అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఈ నెల 21న కామారెడ్డి పట్టణ సీఐ జగదీష్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కామారెడ్డి డీఎస్పీ, ఎస్ఐలతో పాటు పలువురు అధికారులు సైతం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే స్థానిక ఎస్ఐ గోవింద్పై ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రచారం జరగగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఐపీఎల్ క్రికెట్ […]</p>

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా బెట్టింగ్ వసూళ్ల వ్యవహారంలో మరో వికెట్ పడింది. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కేసులో అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఈ నెల 21న కామారెడ్డి పట్టణ సీఐ జగదీష్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కామారెడ్డి డీఎస్పీ, ఎస్ఐలతో పాటు పలువురు అధికారులు సైతం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే స్థానిక ఎస్ఐ గోవింద్పై ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రచారం జరగగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కేసులో బాధితుడు సుధాకర్ నుంచి రూ.20 వేలు వసూలు చేసి కామారెడ్డి పట్టణ ఎస్ఐ గోవింద్ అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలింది. దీంతో ఈ నెల 26వ తేదీన ఏసీబీ అధికారులు ఎస్ఐ గోవింద్ను అరెస్ట్ చేశారు. ఈ మేరకు గోవింద్ను సస్పెన్షన్ చేస్తూ నిజామాబాద్ రేంజ్ ఐజీపీ శివశంకర్ రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు. ఈ కేసులో ఇంకా పోలీస్ అధికారులు ఉన్నారనే కోణంలో ఎంత అక్రమాస్తులు కూడబెట్టారనే కోణంలో ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.






