- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
తప్పుడు సమాచారమిచ్చిన పీఓఓలు.. విచారణకు హాజరుకాలే

దిశ, వెబ్ డెస్క్: ఖమ్మం జిల్లా 1998 డీఎస్సీ అవకతవకలపై అసమగ్ర సమాచారం ఇచ్చిన ఆ జిల్లాకు చెందిన పీఓఓలకు షోకాజ్ నోటీస్ పంపాలని స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆదేశించింది. 1998 డీఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ స్టేట్ ఇన్ఫర్మేషన్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1998 డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టుల (ఎస్జీటీ) నియామకాల నిర్వహణకు సంబంధించి చోటు చేసుకున్న అవకతవకల ఫిర్యాదుపై రెండవ విడత విచారణ జరిగింది. 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ దావా వెంకటేశ్వర్ రావు సమాచార హక్కు చట్టం కింద ఖమ్మం డీఈఓకు దరఖాస్తు చేసుకోగా, అసమగ్ర సమాచారమిచ్చారని ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం వి.ఎం. బంజరకు చేసిన ఫిర్యాదుపై ఈ విచారణ జరిగింది. పీఐఓలు గుణశీల, వెంకటేశ్వరా చారి, ఖమ్మం డీఓఓ యాదయ్య, జాయింట్ డైరెక్టర్ మదన్ మోహన్ లను మంగళవారం విచారణకు హాజరుకావాలని తెలంగాణ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే, మంగళవారం మధ్యాహ్నం జరిగిన విచారణకు వెంకటేశ్వరా చారి, రికార్డ్ అసిస్టెంట్ ఎం. సత్యనారాయణ మాత్రమే హాజరయ్యారు. ఇద్దరు ఫిర్యాదు దారులు కూడా కమిషనర్ ముందు హాజరయ్యారు. విచారణలో భాగంగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చి, ఆధారాలు అందజేశారు. మిగతా ముగ్గురు పీఐఓలు విచారణకు ఎందుకు హాజరుకాలేదని కమిషనర్ డాక్టర్ శంకర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చితంగా హాజరుకావాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేశారు.