వెల్వర్తిలో సంజీవ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

by  |
mla-pilla-1
X

దిశ, భువనగిరి రూరల్: హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందిన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెల్వర్తికి చెందిన టీఆర్ఎస్ దళిత నాయకుడు తక్కళ్ల సంజీవ మృతదేహాన్ని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మంగళవారం సందర్శించి.. పూల మాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంజీవ మరణం పార్టీకి తీరని లోటు అని.. ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.

ఎమ్మెల్యేతోపాటు మార్కెట్ పీఏసీఎస్ చైర్మన్ సురకంటి వెంకట్ రెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకట్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, మండల టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మావిళ్ళ రత్నయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు రాములు, సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి కూచిమల్ల సుధాకర్, పట్టణ అధ్యక్షుడు ఎమ్మే లింగస్వామి, రైతు సమన్వయ సమితి కన్వీనర్ పడమటి మమత, మండల నాయకులు బీసీ సెల్ అధ్యక్షుడు ఐటి పాముల ప్రభాకర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శాంతికుమార్, నాగిళ్ల యాదగిరి, బొడ్డు వెంకట రమణారెడ్డి, చేవ్వ వెంకటేశం, తదితరులు ఉన్నారు.


Next Story

Most Viewed