- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురు చూసి ఎంతకూ నోటిఫికేషన్లు రాకపోవడంతో నిరుద్యోగులు ఆత్మబలిదానాలకు సిద్ధపడుతున్నారు. అదిగో ఉద్యోగాలు.. ఇవిగో నోటిఫికేషన్లు అంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తుండటంతో ఉద్యోగాలొస్తాయన్న ఆశలు కోల్పోతున్నామని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా పదుల సంఖ్యలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆత్మహత్యలు మరింత పెరుగుతున్నాయని ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి.
అయితే, తాజాగా.. రాష్ట్రంలో మరో ఇద్దరు నిరుద్యోగులు ఆత్మబలిదానం చేసుకున్నారు. ఈ ఘటనపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు. ట్వీట్ ప్రకారం.‘‘ నిరుద్యోగుల ఆత్మబలిదానాల మీద పదవులు అనుభవిస్తూ, నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను చంపుతున్న హంతకుడు కేసీఆర్.. ఉద్యమకారుడినని చెప్పుకోవడానికి సిగ్గుపడండి. ఇంకెంత మంది బలితీసుకుంటే నోటిఫికేషన్లు ఇస్తారు దొరా? మీకు కనికరం లేదు, కనీసం చీమ పారినట్టు కూడా లేదు. ఎందుకంటే, చచ్చేది మీ బిడ్డలు కాదు కాబట్టి. మీకు సీట్లు, ఓట్ల మీదున్న ఆరాటం యువత ప్రాణాలు మీద లేదు. నిన్న మహేష్, ఈ రోజు లవన్ కుమార్, శ్రీకృష్ణ.. ఈ ఏడాది దాదాపు 20 మందికి పైగా నిరుద్యోగులను చంపిన హంతకుడు మీరు. మరొక్క నిరుద్యోగి ప్రాణం పోకముందే నోటిఫికేషన్లు వేయండి. లేదంటే రాజీనామా చేయండి.’’ అంటూ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.