టిప్పర్‌ను ఢీ కొట్టిన స్కూటీ..ఇద్దరు మృతి

by  |
టిప్పర్‌ను ఢీ కొట్టిన స్కూటీ..ఇద్దరు మృతి
X

దిశ ,ఇల్లందు: ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కామేపల్లి మండలంలో ఆగివున్న టిప్పర్‌ను స్కూటీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఘటన వివరాల్లోకి వెళితే… సారపాకకు చెందిన కుసుమ రాజు యుగేందర్ అనే వ్యక్తి స్కూటీపై తన బంధువుల అమ్మాయి కర్రీ మాలతీని తీసుకుని హైదరాబాద్ నుంచి వస్తున్నాడు. పండితా పురం బైపాస్ వద్ద ఆగివున్న టిప్పర్‌ను వారి స్కూటీ ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కుసుమ రాజు యుగేందర్ తండ్రి కుసుమ రాజు రమేశ్ ఫిర్యాదు మేరకు కామేపల్లి ఎస్ఐ స్రవంతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story