నిజామాబాద్‌లో విద్యాసంస్థలు బంద్..

by  |
Students
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణలో గత రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీవర్షాల కారణంగా మంగళవారం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్‌లు నారాయణ రెడ్డి, జితేష్ వి పాటిల్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. కలెక్టర్ల ఆదేశాల మేరకు ఈరోజు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్టు జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ప్రైవేట్ విద్యాసంస్థలు పాఠశాలలు తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.


Next Story