'ధాన్యం కొనండి.. లేకుంటే పోరాటం చేపడతాం'

by Sridhar Babu |
ధాన్యం కొనండి.. లేకుంటే పోరాటం చేపడతాం
X

దిశ, మణుగూరు: కేంద్రంలో కృరుడు మోడీ, రాష్ట్రంలో రాక్షసుడు కేసీఆర్ అని, ఈ ఇద్దరి మధ్యలో రైతులు నలిగిపోతున్నారని కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏబ్లాక్ కో-ఆర్డినేటర్ సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆదివారం మండలంలోని మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగబండి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతుల జీవితాలతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయని మండిపడ్డారు. ఈ నాటి వరకు రైతులు పండించిన ధాన్యంను కొనుగోలు చేయలేదని విమర్శించారు. మండలంలో కొనుగోలు కేంద్రాలలో ధాన్యం పట్టడానికి సంచులు కూడా ఏర్పాటు చేయకపోవడం,తుర్పాల పోయడానికి మిషన్లు కూడా ఏర్పాటు చేయకపోవడంపై విమర్శించారు. వెంటనే దీనిపై అధికారులు దృష్టి సారించి రైతులకు అండగా నిలవాలన్నారు. వాతావరణ పరిస్థితులు బాలేనందున కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోతుందని రైతులు భయాందోళనలో ఉన్నారని వ్యాఖ్యానించారు.

ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్లబొల్లి మాటలు పక్కనపెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులు పండించినటువంటి పంటకు రూ.2500 గిట్టుబాటు ధర కల్పించి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ రైతులకి అండగా నిలిచి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల బీసీ సెల్ అధ్యక్షులు బైరిశెట్టి రామారావు, మండల యువజన అధ్యక్షులు కునుసొత్ సాగర్, కరకగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఊకె.రామనాథం,రైతులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed