- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : వాట్సాప్ లేకుండా ప్రస్తుతం ఎవరూ లేరనే చెప్పవచ్చు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరి చేతిలో వాట్సాప్ ఉంటుంది. అయితే ఈ వాట్సాప్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. చాలా రోజుల నుంచి వాట్సాప్ ప్రైవసీ విషయంలో విమర్శలు వెళ్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాట్సాప్కు పోటీగా కేంద్రప్రభుత్వం అలాంటి ఫీచర్లతో ‘సందేశ్’ అనే యాప్ను తీసుకొచ్చింది. వాట్సాప్ మాదిరిగా మెసేజింగ్, ఫైల్, మీడియా షేరింగ్, ఆడియో, వీడియో కాల్స్ ఇతర ఫీచర్లు ఈ యాప్లో రూపొందించారు. ఈ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ తో పాటు యాపిల్ స్టోర్ లోనూ అందుబాటులో ఉంచుతున్నామని ప్రభుత్వం పేర్కొంది. ఈ యాప్ గురించి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నేషనల్ ఎన్ఫోర్మేటిక్స్ సెంటర్ ఈ యాప్ను అభివృద్ధి చేసిందని తెలిపారు. అలాగే ఈ యాప్ ప్రైవసీ విషయంలో ఖచ్చితంగా ఉంటుందని, దీనికి సంబంధించిన నియంత్రణ కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని పేర్కొన్నారు.
చాలా మందికి యాప్ ప్రైవసీ విషయంలో కొంత భయం అనేది ఉంటుంది. కానీ, ఈ యాప్ ప్రైవసీ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేకుండా వినియోగించుకోవచ్చునని మంత్రి చంద్రశేఖర్ తెలిపారు. అంతే కాకుండా దీనికి వెబ్ వర్షన్ కూడా అందుబాటులో ఉంది. సందేశ్ వెబ్ పోర్టల్ ద్వారా దీనిని వినియోగించుకోవచ్చు. అందులో మొబైల్ నంబర్ లేదా ఈ మెయిల్ ఐడీని నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేస్తే సందేశ్ వెబ్ ఓపెన్ అవుతుంది. ఇప్పటివరకు ప్రభుత్వ ఈ మెయిల్ ఐడీతో మాత్రమే సందేశ్ లో ఖాతా తెరవాలనే నిబంధన ఉండేది. అయితే ఇప్పుడు ఈ నిబంధనను మార్చారు. ఈ యాప్లో ముఖ్యమైన విషయం ఎమిటంటే దీన్ని యాప్ ద్వారానే కాకుండా మెయిల్ ద్వారా కూడా ఓపెన్ చేయవచ్చు.