11 బైకులను దొంగిలించిన ఘనుడు అరెస్టు..

by  |
11 బైకులను దొంగిలించిన ఘనుడు అరెస్టు..
X

దిశ, నిజామాబాద్ రూరల్ : హైదరాబాద్ మహానగరంలో బైకుల దొంగతనమే పనిగా పెట్టుకున్న మాక్లూర్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన సాయికుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలోని రూరల్ మండలం చంద్ర శేఖర్ కాలనీలో ద్విచక్ర వాహనాన్ని దొంగిలిస్తుండగా రూరల్ ఎస్ఐ లింబాద్రి, టాస్క్ఫోర్స్ ఏఎస్సై రామకృష్ణలు చాకచక్యంగా పట్టుకున్నారు.

వివరాల్లోకెళితే.. మాక్లూర్ మండలానికి చెందిన సాయికుమార్ గత మూడు నెలలుగా నగరంలోని పేట్ బషీర్బాగ్, మేడ్చల్, చిక్కడపల్లి, మెహిదీపట్నం, దుండిగల్ ప్రాంతాల నుండి ద్విచక్ర వాహనాలను దొంగిలించాడు. ఈరోజు మధ్యాహ్నం రూరల్‌లోని చంద్ర శేఖర్ కాలనీలో బైకును దొంగిలిస్తుండగా రూరల్ ఎస్సై లింబాద్రి టాస్క్ఫోర్స్ ఏఎస్సై రామకృష్ణలు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని విచారించగా మొత్తంగా పదకొండు బైకులు దొంగిలించినట్లుగా తేలింది. వాటిని మాక్లూర్ మండలం ధర్మారం గ్రామంలోని తన సొంత ఇంటి వద్ద దాచి పెట్టినట్లు రూరల్ ఎస్ఐ లింబాద్రి గుర్తించారు. పెద్ద మొత్తంలో బైకులను దొంగిలించిన సాయికుమార్‌ను పట్టుకుని రిమాండ్ తరలించిన ఎస్సై లింబాద్రిని, టాస్క్ఫోర్స్ ఏఎస్సై రామకృష్ణ కానిస్టేబుల్ కిరణ్ గౌడ్, మహేష్‌లను నిజామాబాద్ సౌత్ జోన్ రూరల్ సీఐ రవి అభినందించారు.


Next Story

Most Viewed