- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు రెండు నెలల క్రితం బైక్ ప్రమాదానికి గురయ్యాడు. చికిత్స అనంతరం ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు సాయితేజ్ నోరువిప్పింది లేదు. అయితే తన లేటెస్ట్ మూవీ ‘రిపబ్లిక్’ను తాజాగా ఓటీటీలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో చిత్రయూనిట్ ఓ ప్రెస్మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్మీట్కి వస్తాడని అభిమానులు ఆశ పడ్డారు. కానీ సాయితేజ్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు.
తన బదులుగా ఓ వాయిస్ మెసేజ్ను పంపాడు. ‘హాయ్. నేను మీ సాయి ధరమ్ తేజ్. నాపై, నా సినిమాలపై మీరు చూపిన ప్రేమ, అభిమానం చాలా గొప్పవి. అంతేకాకుండా నాకు ప్రమాదం జరిగినప్పుడు మీరు చేసిన ప్రార్థనలకు కృతజ్ఞతలు. రిపబ్లిక్ సినిమాని మీ అందరితో కలిసి చూద్దామనుకున్నా. కానీ కుదరలేదు. అయితే ఈ సినిమా జీ5 ఓటీటీలో నవంబర్ 26న స్ట్రీమ్ అవుతుంది. అందరూ తప్పక సినిమా చూడండి. సినిమాపై మీ అభిప్రాయాన్ని, సినిమా చూస్తే ఎలా అనిపించిందో చెప్పండి. జై హింద్’ అంటూ మెసేజ్ పూర్తి చేశాడు.