- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కరీంనగర్ సిటీ: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో ప్రయాణికుల శ్రేయస్సే లక్ష్యంగా, చర్యలు కొనసాగుతున్నాయి. సంస్థలో జరుగుతున్న తప్పిదాలు, విధుల పట్ల సిబ్బంది కనబరుస్తున్న నిర్లక్ష్యంపై వస్తున్న ఫిర్యాదుల పట్ల ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ ప్రయాణికుడు చేసిన ట్వీట్తో చర్యలకు ఆదేశించారు. వేములవాడకు చెందిన వెల్దండి సదానందం ఈనెల 6న వేములవాడ నుంచి కరీంనగర్కు బస్సులో ప్రయాణిస్తుండగా, ఆ సమయంలో డ్రైవర్ సెల్ఫోన్ మాట్లాడుతూ కనిపించడంతో వీడియో తీసి ట్విట్టర్లో సజ్జనార్కు పోస్టు చేశారు. దీనిపై స్పందించిన సజ్జనార్ డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేరోజు కరీంనగర్లో దిగి బస్టాండ్లో మరుగుదొడ్ల నిర్వహణ, వాటర్ బాటిళ్ల అమ్మకాలపై అధిక వసూళ్లు చేస్తున్నట్లు పోస్టు చేయడంతో వారికి రూ.5 వేలు జరిమానా విధించాలని, కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వెళ్లే క్రమంలో కండక్టర్ మాస్క్ లేకుండా విధులు నిర్వహిస్తున్న ఫొటో షేర్ చేయడంతో కండక్టర్పై చర్యలు తీసుకోవాలని, ఆయా డిపోల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది.
- Tags
- Karimnagar