రేవంత్ వైట్ చాలెంజ్ పై ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్ సంచలన ట్వీట్..

by  |
rs-praveen-kumar
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వైట్ చాలెంజ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఈ చాలెంజ్ ను స్వీకరించినా.. స్వీకరించకపోయినా.. చర్చనీయాంశమవుతోంది. నిన్న రేవంత్ విసిరిన వైట్ చాలెంజ్ ను స్వీకరించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తన వంతుగా మరో ఇద్దరికి చాలెంజ్ విసిరారు. అందులో బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో చాలెంజ్ లపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆయన చేసిన ట్వీట్

‘‘చివరికి మన బ్లాక్&వైట్ చాలెంజీలు తన్నులాటల, పరువు నష్టాల క్లైమాక్సుకొచ్చినయన్నమాట. రైతుల కష్టాలు, పోడు/అసైన్డ్ భూములు, కుంభకోణాలు, నిరుద్యోగ సమస్యల నుండి మన దృష్టి మళ్లించడం కోసమే ఈ హైడ్రామా! తెలంగాణ నువ్వు ఎటు వైపు? ఈ చెత్త చాలెంజీల వైపా లేక చిద్రమైన బతుకుల కోసం నిలబడ్డ బహుజనుల వైపా?’’ అని ఉంది. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ పై చర్చ మొదలైంది. రాష్ట్ర రాజకీయాలు కేవలం డ్రగ్స్ పై సవాళ్లు, ప్రతిసవాళ్లు వేసుకుంటూ అసలైన సమస్యలను పక్కదారి పెట్టించారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.


Next Story

Most Viewed