ఫ్లైఓర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్ల పొదల్లో డెడ్ బాడీ

by  |
ఫ్లైఓర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్ల పొదల్లో డెడ్ బాడీ
X

దిశ, శంకర్ పల్లి : శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫతేపూర్ ఫ్లైఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ (34) మోటార్ బైక్ పై చేవెళ్ల వైపు వెళ్తుండగా వెనుక వైపు నుంచి అతివేగంగా వస్తున్న మరో వాహనం ఢీకొట్టడంతో రోడ్డు పక్కన చెట్ల పొదల్లో పడిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో 108 సిబ్బంది, శంకర్పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు ప్రవీణ్ కుమార్ ద్విచక్ర వాహనంపై హెల్మెట్ ధరించి వస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ద్విచక్ర వాహనంపై ఒక్కడే ఉన్నాడా? ఇంకెవరైనా ఉన్నారా? గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడం తో కిందపడి మృతి చెందాడా? అనేది తేలాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు శంకర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్ తెలిపారు.


Next Story

Most Viewed