పండుగపూట విషాదం.. కాటేసిన మృత్యువు

by  |
పండుగపూట విషాదం.. కాటేసిన మృత్యువు
X

దిశ ,ఇల్లందు: కామేపల్లి మండలం గోవింద్ రాల గ్రామానికి చెందిన లకావత్ మంగి(37), బావ్ సింగ్(41) ఇద్దరు దంపతులు ద్విచక్రవాహనంపై ఇల్లందులో దసరా ఉత్సవాన్ని చూడడానికి వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కొత్త బస్టాండ్ వద్ద లారీ దిగబడడంతో రాంగ్ రూట్ లో వచ్చిన ఫైర్ ఇంజన్ ను తప్పించబోయి అదుపుతప్పి భార్యభర్తలిద్దరు ప్రమాదానికి గురయ్యారు. వెనక టైర్ లు పడడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా.. భర్త స్వల్ప గాయాల పాలయ్యారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అటు కళాంజలి థియేటర్ ఎదురుగా మహిళ కుటుంబ సభ్యులు ధర్నా చేస్తున్నారు.


Next Story