ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి పరిస్థితి విషమం

by Sridhar Babu |   ( Updated:2021-12-06 00:50:00.0  )
ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి పరిస్థితి విషమం
X

దిశ, ఖమ్మం రూరల్​: తాగిన మైకంలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. ఖమ్మం రూరల్ మండలంలోని బైపాస్​ మున్నేరు వంతెనపై శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయికృష్ణనగర్ కాలనీలో ఓ ఫ్యామిలీ నివాసం ఉంటోంది. అయితే శుక్రవారం ఉదయం తండ్రి.. కుమారుడు, కుమార్తెలను ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్​కళాశాలలో డ్రాప్​ చేసేందుకు టూ వీలర్‌పై వెళ్తున్నారు.

ఈ క్రమంలో ఓ లారీ డ్రైవర్ మద్యం మత్తులో లారీ నడుపుతూ.. బైకును వెనుక నుంచి వచ్చి ఢీకొట్టాడు. ఈ ఘటనలో కుమారుడి నడుం మీద నుంచి లారీ టైరు వెళ్లడంతో కిడ్నీలు బయటకు వచ్చాయి. తండ్రి, కుమార్తెలకు సైతం నడుము విరిగింది. వెంటనే స్థానికులు 108కు , పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వంతెనపై ప్రమాదం జరగడంతో కిలోమీటరకు పైగా ట్రాఫిక్ నిలిపోయింది. మద్యం తాగి లారీ నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, లారీ డ్రైవర్‌ను కఠినంగా శిక్షించాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



Next Story