- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి పరిస్థితి విషమం

దిశ, ఖమ్మం రూరల్: తాగిన మైకంలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. ఖమ్మం రూరల్ మండలంలోని బైపాస్ మున్నేరు వంతెనపై శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయికృష్ణనగర్ కాలనీలో ఓ ఫ్యామిలీ నివాసం ఉంటోంది. అయితే శుక్రవారం ఉదయం తండ్రి.. కుమారుడు, కుమార్తెలను ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్కళాశాలలో డ్రాప్ చేసేందుకు టూ వీలర్పై వెళ్తున్నారు.
ఈ క్రమంలో ఓ లారీ డ్రైవర్ మద్యం మత్తులో లారీ నడుపుతూ.. బైకును వెనుక నుంచి వచ్చి ఢీకొట్టాడు. ఈ ఘటనలో కుమారుడి నడుం మీద నుంచి లారీ టైరు వెళ్లడంతో కిడ్నీలు బయటకు వచ్చాయి. తండ్రి, కుమార్తెలకు సైతం నడుము విరిగింది. వెంటనే స్థానికులు 108కు , పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వంతెనపై ప్రమాదం జరగడంతో కిలోమీటరకు పైగా ట్రాఫిక్ నిలిపోయింది. మద్యం తాగి లారీ నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, లారీ డ్రైవర్ను కఠినంగా శిక్షించాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- Tags
- khammam