ఔటర్ రింగ్ రోడ్డులో భయానక రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

by  |
ఔటర్ రింగ్ రోడ్డులో భయానక రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
X

దిశ, కీసర : కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షామీర్‌పేట్, కీసర మధ్యలో ఓఆర్ఆర్‌పై ఓ కారు.. ఆగివున్న లారీని ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగంగా పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతులను అల్వాల్‌కు చెందిన సుమంత్ రెడ్డి, శంకర్ రెడ్డిగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన తరుణ్ రెడ్డిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed