కమ్యూనిస్టు ఉద్యమాలతోనే హక్కులు

by  |
కమ్యూనిస్టు ఉద్యమాలతోనే హక్కులు
X

దిశ, రంగారెడ్డి
కమ్యూనిస్టుల ఉద్యమాలతోనే రైతు, ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలకు హక్కులు వచ్చాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. హైదరాబాద్​లోని ముఖ్ధం భవన్​లో గురువారం రంగారెడ్డి జిల్లా కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పల్లా వెంకట్​రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందన్నారు. సామవ్యాద, లౌకికవాద ప్రజాస్వామ విధానాలకు కట్టుబడి సీపీఐ కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని సూచించారు. మోడీ ప్రభుత్వంలో మతతత్వశక్తులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. పేదలకు భూమి ఇచ్చేందుకు సహకరించని ప్రభుత్వాలు.. కార్పోరేట్​ కంపెనీలు చేసే కబ్జాలకు అండగా ఉంటున్నాయని విమర్శించారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సీపీఐ పోరాటాలు కొనసాగాలని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags: Rights with the communist movement, Modi Sarkar is working on anti-democratic policies, TRS is preferred for corporations


Next Story

Most Viewed