- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, రంగారెడ్డి
కమ్యూనిస్టుల ఉద్యమాలతోనే రైతు, ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలకు హక్కులు వచ్చాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ముఖ్ధం భవన్లో గురువారం రంగారెడ్డి జిల్లా కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పల్లా వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందన్నారు. సామవ్యాద, లౌకికవాద ప్రజాస్వామ విధానాలకు కట్టుబడి సీపీఐ కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని సూచించారు. మోడీ ప్రభుత్వంలో మతతత్వశక్తులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. పేదలకు భూమి ఇచ్చేందుకు సహకరించని ప్రభుత్వాలు.. కార్పోరేట్ కంపెనీలు చేసే కబ్జాలకు అండగా ఉంటున్నాయని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సీపీఐ పోరాటాలు కొనసాగాలని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags: Rights with the communist movement, Modi Sarkar is working on anti-democratic policies, TRS is preferred for corporations